యాప్నగరం

వైసీపీ ఎంపీపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన టెనెట్ సంస్థ

కినేటా టవర్‌లో పదేళ్లకు అద్దె ఒప్పందం ఉన్నప్పటికీ ల్యాబ్‌ను ఖాళీ చేయాలని దౌర్జన్యం చేశారని.. ల్యాబ్‌కు వచ్చే దారుల్ని మూసివేయడాన్ని సవాలు చేస్తూ టెనెట్‌ మెడ్‌కార్పొ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరపున డాక్టర్‌ టి.విజేందర్‌రెడ్డి హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Samayam Telugu 23 Apr 2020, 9:07 am
వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరిపై టెనెట్ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తమ సంస్థ నడుపుతున్న ల్యాబ్‌ను తన భవనంలో నుంచి ఖాళీ చేయాలని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించింది. కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఐసీఎంఆర్‌ గుర్తించిన ల్యాబ్‌లో టెనెట్ ఒకటని.. ఈ కారణంతోనే భవనాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసు ఇవ్వడంతో పాటు ల్యాబ్‌లోకి వెళ్లకుండా ఎంపీ బాలశౌరి తన అనుచరులతో దౌర్జన్యంగా దారులు మూసివేశారని లాయర్ కోర్టుకు వివరించారు.
Samayam Telugu high court


కినేటా టవర్‌లో పదేళ్లకు అద్దె ఒప్పందం ఉన్నప్పటికీ ల్యాబ్‌ను ఖాళీ చేయాలని దౌర్జన్యం చేశారని.. ల్యాబ్‌కు వచ్చే దారుల్ని మూసివేయడాన్ని సవాలు చేస్తూ టెనెట్‌ మెడ్‌కార్పొ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరపున డాక్టర్‌ టి.విజేందర్‌రెడ్డి హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 2011 నవంబరులో భవనం యజమానితో కినేటా సంస్థ పదేళ్ల పాటూ ఒప్పందం చేసుకుందన్నారు.

ఈ పిటిషన్‌పై విచారణ సమయంలో ప్రభుత్వ లాయర్ కూడా వాదనలు వినిపించారు. ఇప్పటికే భవన యజమానిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని.. అడ్డంకులు తొలగించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ల్యాబ్‌ నిర్వహణకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.. తదుపరి విచారణను వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.