యాప్నగరం

Godavari Floods: యానాంని చుట్టుముట్టిన నీరు.. నేడు, రేపు పాఠశాలలకు సెలవు

యానాంలో ఇవాళ, రేపు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ యానాం పరిపాలన అధికారి శర్మ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణలో మూతపడిన విద్యా సంస్థలు ఈరోజు నుంచి తెరుచుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో.. ముంపు గ్రామాల్లో వారం రోజుల పాటు పాఠశాలలు మూతపడ్డాయి.

Edited byరావు | Samayam Telugu 18 Jul 2022, 11:33 am

ప్రధానాంశాలు:

  • యానాంలో కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి
  • ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి 25 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
  • ఈరోజు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu yanam
యానాం వీధుల్లో చేరిన గోదావరి వరద నీరు
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టినా.. గోదావరికి ఇంకా వరద వస్తూనే ఉంది. ఈ వరదల ప్రభావానికి యానం అతాలకుతలమైంది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. అధికారులు అందర్నీ మొదటి అంతస్థులో ఉండాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. కొద్ది కొద్దిగా వరద వచ్చి చేరుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగించారు. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు యానంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
యానాంలో ఇవాళ, రేపు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ యానాం పరిపాలన అధికారి శర్మ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణలో మూతపడిన విద్యా సంస్థలు ఈరోజు నుంచి తెరుచుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో.. ముంపు గ్రామాల్లో వారం రోజుల పాటు పాఠశాలలు మూతపడ్డాయి.

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 25 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని అధికారులు కిందకు విడుదల చేయడంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరికి దగ్గరలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా మునిగిపోవడంతో వారందర్నీ పునరావాస కేంద్రాలకు తరలించారు. అయ్యన్న నగర్ దగ్గర్లో గోదావరి గట్టుకు గండిపడటంతో యానాం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దాంతో కేవలం ముప్పై నిమిషాల్లోనే చాలా కాలనీల్లో నడుము లోతు నీళ్లు వచ్చాయి. యానాంలో అయితే ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. వరద ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.