యాప్నగరం

AP Capital: ‘బాబు వైజాగ్ నుంచి పాలించారు.. రాజ్యాంగంలో రాజధాని అనేదే లేదు’

రాజధాని వికేంద్రీకరణపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ.. రాజధానిపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదన్నారు.

Samayam Telugu 23 Jan 2020, 7:56 pm
ఏపీ రాజధాని వికేంద్రీకరణపై తీవ్ర దూమారం రేగుతున్న వేళ.. రాజధానిపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసన మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మండలి రద్దు దిశగా సంకేతాలిచ్చారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. మండలి ఉండటం అవసరమా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాజధాని అంశంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu jagan babu


భారత రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదమే లేదన్న జగన్.. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అని మాత్రమే ఉంటుందన్నారు. బిల్లు, చట్టాలతో సంబంధం లేకుండా.. అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఎక్కడ నుంచైనా పాలన చేయొచ్చన్నారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీని పెట్టొచ్చు.. ఎక్కడి నుంచైనా చట్టాలు చేయొచ్చు. రాజ్యాంగం ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చట్ట సభల్లో కూర్చొని తీర్మానం చేస్తే అదే గవర్నెన్స్’’ అని జగన్ తెలిపారు.

పరిపాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం.. పరిపాలనా వికేంద్రీకరణ అనేది ప్రజలు ఇచ్చిన అధికారమన్న జగన్.. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు విశాఖపట్నం నుంచే పరిపాలన చేశారని గుర్తు చేశారు. తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నప్పుడు.. ఊటీ నుంచి ప్రభుత్వాన్ని నడిపారన్నారు. సీఎం ఎక్కడుంటే అక్కడి నుంచి పాలన సాగుతుందన్నారు. ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడి నుంచైనా చట్టాలు చేయవచ్చన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.