యాప్నగరం

అశోక్ గజపతిరాజు నిజస్వరూపం ఇదే, చెప్పడానికే నీతులు.. ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు!

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 31 Jul 2021, 6:18 pm
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం, పారదర్శకతంటూ ఆదర్శాలు వల్లించడం వరకే అశోక్ గజపతి పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు.
Samayam Telugu అశోక్ గజపతి రాజు


విజయనగరం మాన్సాస్ ట్రస్ట్‌లో 2004 నుంచి ఆడిటింగే లేదని విజయసాయిరెడ్డి అన్నారు. అశోక్ గజపతి పారదర్శకత, అతని నిజస్వరూపం ఇదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీతులు ఎదుటివారికి చెప్పడానికే ఉన్నాయన్నట్లు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం ట్వీట్ చేశారు.


‘‘ప్రజాస్వామ్యం, పారదర్శకతంటూ ఆదర్శాలు వల్లించడం వరకేనా పూసపాటి అశోక్. 2009 నుంచి సింహాచలం దేవస్థానంలో నగల అప్రైజ్ జరగలేదు. మాన్సాస్ లో 2004నుంచి ఆడిటింగే లేదు. ఇదీ నీ పారదర్శకత. నీ నిజస్వరూపం. నీతులు ఎదుటివారికి చెప్పడానికే ఉన్నాయన్నట్లు ప్రవర్తిస్తున్నావ్.’’ అని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.