గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 128 మందికి పద్మ అవార్డులు లభించాయి. నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సాహిత్యం, విద్య విభాగం నుంచి ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుకు, కళలు విభాగం నుంచి గోసవీడు షేక్ హుస్సేన్ (మరణం తర్వాత)కు, మెడిసిన్ విభాగం నుంచి డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
గరికపాటి వారికి, తెలుగు రాష్ట్రాల్లో విశేష గుర్తింపు..
సాహిత్యం విభాగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజూ ఉదయాన్నే టీవీలో, నిరంతరం యూట్యూబ్లో, ఎల్లవేళలా వాట్సాప్ స్టేటస్లో అందరికీ ఏదోబోధ చేస్తూ కనిపిస్తూనే ఉండారు. గరికపాటి ఉపన్యాసాలు వినడానికి అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తుంటారు.
గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14వ తేదీన విలంబి నామ సంవత్సరంలో జన్మించారు. గరికిపాటు ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. సుమారు 30 ఏళ్ల పాటు ఉపాద్యాయుడిగా సేవలందించారు.
గరికపాటి నరసింహారావు తన ఇద్దరు కుమారులకు ప్రముఖ రచయితలైన శ్రీశ్రీ, గురజాడ పేర్లు పెట్టడం ద్వారా సాహిత్యంపై తనకున్న అభిలాషను చాటుకున్నారు. గరికిపాటి తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద అవధాని. మన దేశంలోనే కాక, విదేశాల్లో సైతం ఆయన ఎన్నో అవధానాలను పూర్తి చేశారు. గరికపాటి గొప్ప ఉపన్యాసకుడు. మొదట ఆయన 11 అంశాలు, జీవనం, సాహిత్యం, సంసృతి వంటి ఇతర అంశాలపై ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు సీడీలుగా విడుదలయ్యయి. ఇవే కాకుండా పద్య కావ్యాలు, పాటలు, ఇలా ఎన్నో వాటిని ఆయన పుస్తకాలుగా ప్రచురరించి చాలా ప్రఖ్యాతి గాంచారు.
ఉపాధ్యాయుడిగా ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవార్డులను, సత్కారాలను అందుకున్నారు. అలాగే, గరికపాటి ఎన్నో బిరుదులు కూడా అందుకున్నారు. ప్రవచన కిరీటి, అమెరికా అవధాన భారతి, ధారణా బ్రహ్మ రాక్షసుడు (1997), సహస్రభారతి (1996), అవధాన శారద (1995), శతావధాన గీష్పతి (1994), శతావధాన కళా ప్రపూర్ణ వంటి బిరుదాంకితులు.
మతసామరస్యానికి ప్రతీక..
ప్రముఖ హిందూ ఆలయంలో ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన గోసవీడు షేక్ హసన్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. అలాంటి వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి భారత ప్రభుత్వం తగురీతిలో గౌరవించింది. షేక్ హసన్కు మరణానంతరం ఈ పురస్కారం లభించింది. భద్రాచలం దేవాలయం ఆస్థాన విద్వాంసులుగా నాదస్వర కళాకారులు దివంగత గోసవీడు షేక్ హసన్ సేవలందించారు.
అలాగే, మెడిసిన్ విభాగంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, పోలియో నిర్మూలన మిషన్లో కీలకంగా వ్యవహరిస్తూ పేదలకు వైద్యం అందించే డాక్టర్ సుంకర ఆదినారాయణరావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
గరికపాటి వారికి, తెలుగు రాష్ట్రాల్లో విశేష గుర్తింపు..
సాహిత్యం విభాగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజూ ఉదయాన్నే టీవీలో, నిరంతరం యూట్యూబ్లో, ఎల్లవేళలా వాట్సాప్ స్టేటస్లో అందరికీ ఏదోబోధ చేస్తూ కనిపిస్తూనే ఉండారు. గరికపాటి ఉపన్యాసాలు వినడానికి అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తుంటారు.
గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14వ తేదీన విలంబి నామ సంవత్సరంలో జన్మించారు. గరికిపాటు ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. సుమారు 30 ఏళ్ల పాటు ఉపాద్యాయుడిగా సేవలందించారు.
గరికపాటి నరసింహారావు తన ఇద్దరు కుమారులకు ప్రముఖ రచయితలైన శ్రీశ్రీ, గురజాడ పేర్లు పెట్టడం ద్వారా సాహిత్యంపై తనకున్న అభిలాషను చాటుకున్నారు. గరికిపాటి తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద అవధాని. మన దేశంలోనే కాక, విదేశాల్లో సైతం ఆయన ఎన్నో అవధానాలను పూర్తి చేశారు. గరికపాటి గొప్ప ఉపన్యాసకుడు. మొదట ఆయన 11 అంశాలు, జీవనం, సాహిత్యం, సంసృతి వంటి ఇతర అంశాలపై ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు సీడీలుగా విడుదలయ్యయి. ఇవే కాకుండా పద్య కావ్యాలు, పాటలు, ఇలా ఎన్నో వాటిని ఆయన పుస్తకాలుగా ప్రచురరించి చాలా ప్రఖ్యాతి గాంచారు.
ఉపాధ్యాయుడిగా ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవార్డులను, సత్కారాలను అందుకున్నారు. అలాగే, గరికపాటి ఎన్నో బిరుదులు కూడా అందుకున్నారు. ప్రవచన కిరీటి, అమెరికా అవధాన భారతి, ధారణా బ్రహ్మ రాక్షసుడు (1997), సహస్రభారతి (1996), అవధాన శారద (1995), శతావధాన గీష్పతి (1994), శతావధాన కళా ప్రపూర్ణ వంటి బిరుదాంకితులు.
మతసామరస్యానికి ప్రతీక..
ప్రముఖ హిందూ ఆలయంలో ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన గోసవీడు షేక్ హసన్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. అలాంటి వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి భారత ప్రభుత్వం తగురీతిలో గౌరవించింది. షేక్ హసన్కు మరణానంతరం ఈ పురస్కారం లభించింది. భద్రాచలం దేవాలయం ఆస్థాన విద్వాంసులుగా నాదస్వర కళాకారులు దివంగత గోసవీడు షేక్ హసన్ సేవలందించారు.
అలాగే, మెడిసిన్ విభాగంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, పోలియో నిర్మూలన మిషన్లో కీలకంగా వ్యవహరిస్తూ పేదలకు వైద్యం అందించే డాక్టర్ సుంకర ఆదినారాయణరావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.