యాప్నగరం

టీడీపీకి భారీ షాక్.. కీలక నేత రాజీనామా!

మూడు రాజధానుల విషయంలో టీడీపీకి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా, కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి విక్టర్ టీడీపీ రాజీనామా చేశారు.

Samayam Telugu 1 Feb 2020, 4:14 pm
తెలుగు దేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు కీలక నేత, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి విక్టర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించారు.
Samayam Telugu tdp


అలాగే టీడీపీపై విమర్శలు గుప్పించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు టీడీపీ అడ్డుపడటం బాధాకరమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం స్థానిక టీడీపీ నేతలకు ఇష్టం లేదని విక్టర్ ఆరోపించారు. అందుకే తాను తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విక్టర్ చెప్పుకొచ్చారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పంపినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.

కాగా, ప్రస్తుతం నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా టి.ఆర్థర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీలో వర్గ పోరాటం నడుస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి, ఎమ్మెల్యే ఆర్థర్‌కు మధ్య ఉన్న విభేదాలు ఇటీవలే భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత విక్టర్‌ను రాజీనామా చేశారు. త్వరలోనే విక్టర్ అధికారికంగా ఆయన వైసీపీలోకి చేరుతారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.