యాప్నగరం

3 రాజధానులకు అనుకూలంగా ఓటేసి తప్పుచేశా.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

అమరావతిని మార్చడం సరికాదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. అయినా ఉత్తరాంధ్రవాసినగా తాను మూడు రాజధానులకు అనుకూలంగా ఓటేసి తప్పు చేశానన్నారు.

Samayam Telugu 28 Jan 2020, 4:05 pm
మూడు రాజధానులకు అనుకూలంగా ఓటేసి తప్పు చేశానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ వ్యాఖ్యానించారు. రూ. వేల కోట్లతో నిర్మించిన రాజధాని అమరావతిని మార్చడం సరైన విధానం కాదన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం (జనవరి 27) ఆయన మాట్లాడుతూ.. విధానపరమైన నిర్ణయాలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు మార్చడం సరైన విధానం కాదన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా శాసన మండలిలో చోటు చేసుకున్న సంఘటనలు తనను బాధించాయని, ఇలాంటి సభలకు ఎందుకు వచ్చామా? అని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu raghu


మండలి రద్దుపై మాట్లాడుతూ.. తలనొప్పిగా ఉందని చెప్పి తలను నరికేసేలా ప్రభుత్వ తీరు ఉందని ఎమ్మెల్సీ రఘువర్మ విమర్శించారు. హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని హైకోర్టును రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసిగా తాను మూడు రాజధానులకు, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశానని, ఇది పొరపాటేనన్నారు. తాను పదవులను పట్టుకుని వేలాడే వ్యక్తిని కాదని, అందుకే మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలైనా ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు తనకు సమస్యలపై చర్చించేందుకు సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం చేసినంత మాత్రాన అమల్లోకి రాదని, కనీసం రెండేళ్లయినా సమయం పడుతుందన్నారు. తాను పదవిలో ఉన్నా, లేకపోయినా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.