యాప్నగరం

కృష్ణా జిల్లా: కూలీలతో వెళ్తోన్న ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి, 10మందికిపైగా గాయాలు

వ్యవసాయ పనుల కోసం వెళుతుండగా బోల్తాపడిన ట్రాక్టర్.. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.. మరో 10మందికిపైగా గాయాలు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 25మంది కూలీలు.

Samayam Telugu 17 Jan 2020, 9:29 am
కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ సమీపంలో జొన్నలగడ్డ దగ్గర కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు చనిపోగా.. మరో 10మందికిపైగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన గురించి తెలియగానే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
Samayam Telugu vja.


ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 25మంది కూలీలు ఉన్నారు. బాధితులు పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదల వాసులుగా గుర్తించారు. కూలీలు వ్యవసాయ పనుల కోసం గుమ్మడిదల నుంచి దేసినేనిపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యమా.. అతి వేగంతోనే ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. పండుగ మరుసటి రోజే ఘటన జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.