యాప్నగరం

కడప జిల్లాలో ప్రాణం తీసిన శానిటైజర్.. ముగ్గురు మృతి

ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తన ఇంటి దగ్గర చనిపోయారు.. కడప జిల్లాలో ఘటన.

Samayam Telugu 3 Aug 2020, 10:26 am
ఏపీ మద్యం దొరక్కపోవడంతో కొంతమంది శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుటున్నారు. ప్రకాశం జిల్లా ఘటన మర్చిపోకముందే కడప జిల్లాలో మరో ఘటన జరిగింది. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు చనిపోయిన ఘటన కలకలంరేపింది. శానిటైజర్‌ తాగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తన ఇంటి దగ్గర చనిపోయారు. మృతులను చెన్నకేశవులు, భీమయ్య, ఓబులేష్‌లుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఖననం చేశారు.
Samayam Telugu కడప జిల్లాలో విషాదం


అంతేకాదు ఈ ప్రాంతంలో వారం రోజుల నుంచి ఆరుగురు శానిటైజర్‌ తాగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.. మద్యం ధరలు భరించలేక మందుబాబులు ఇలా శానిటైజర్‌ తాగుతున్నారని మృతుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల క్రితమే ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ తాగి 16మంది చనిపోయిన చేరిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.