యాప్నగరం

గుంటూరు: పెట్రోల్ బంక్‌లో విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి

పెట్రోల్ బంక్‌‌లో బల్సులు మారుస్తున్న సిబ్బంది.. పొరపాటున ఇనుప స్టాండ్ 11 కేవీ వైర్‌కు తగలడంతో విద్యుత్ సరఫరా.. అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు.

Samayam Telugu 18 Jan 2020, 12:54 pm
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రామచంద్రపురం దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై పెట్రోల్ బంక్‌లో విద్యుత్ షాక్‌తో ముగ్గురు చనిపోయారు. పెట్రోల్ బంక్‌లో విద్యుత్ దీపాలు మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగింది. 11కేవీ వైర్‌కు ఐరన్ స్టాండ్ తగలడంతో విద్యుత్ షాక్ తగిలింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి , ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతులు శ్రీనివాసరావు, మౌలాలి, శేఖర్‌గా గుర్తించారు.
Samayam Telugu gnt


విద్యుత్ బల్బ్‌లు మారుస్తుండగా.. ఇనుప స్టాండ్‌‌కు విద్యుత్ వైర్ తగలడంతో ప్రమాదం జరిగింది. చనిపోయినవారు బొప్పూడి, పోలిరెడ్డిపాలెంకు చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురూ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.