యాప్నగరం

ముగ్గురిని బలి తీసుకున్న నిద్రమత్తు.. మృతులు శ్రీకాకుళం వాసులు

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వాహనం అదుపుతప్పి కంటైనర్‌ను ఢీ కొట్టింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 14 Sep 2019, 10:28 am
త్వరగా గమ్యం చేరాలన్న ఆత్రుత ముగ్గురిని బలితీసుకుంది. నిద్ర ముంచుకొస్తున్నా డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు పోవడమే వారి పాలిట శాపమైంది. ట్రాలీ ఆటో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆ విషాద సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు వద్ద 16 వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మరో ముగ్గురు గాయపడ్డారు.
Samayam Telugu Road_accident


Must Read :33 మంది పిల్లలను రేప్ చేసి చంపేసి, ఇంట్లోనే పాతేశాడు.. జోకర్ కాదు కిల్లర్!

శ్రీకాకుళం జిల్లా శింగవలస గ్రామానికి చెందిన కురిటి అప్పన్న గుంటూరు సమీపంలోని గొర్రెల మండిలో గొర్రెలు కొనేందుకు తన మిత్రులు మూలాల శ్రీను, చింతలోల సింహాచలం, గోరా కన్నయ్య, కోటిపల్లి శాంతారావులతో ట్రక్కు ఆటోలో బయలుదేరాడు. ట్రక్కు డ్రైవర్ మార్గం మధ్యలో మరో ప్రయాణికుడిని ఎక్కించుకున్నాడు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మంగళగిరి సమీపానికి చేరుకునే సరికి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కంటైనర్‌ను ఢీ కొట్టింది.

Also Read :వేరొకరితో అక్రమ సంబంధం.. భర్తను చంపేసి చెత్తకుప్పలో పూడ్చేసింది

ఈ ప్రమాదంలో కోటిపల్లి శాంతారావు (22) గోరా కన్నయ్య(28)లు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మధ్యలో వాహనం ఎక్కిన గుర్తు తెలియని యువకుడికి గాయాలవడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. వాహనంలో ఉన్న మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.