యాప్నగరం

అనంతపురం: బోల్తా కొట్టిన బొలేరో.. ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా కాల్వపల్లి దగ్గర కర్ణాటక నుంచి వస్తుండగా బోల్తా కొట్టిన బొలేరో వాహనం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు.

Samayam Telugu 10 Dec 2019, 4:01 pm
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెళుగుప్ప మండలం కాల్వపల్లి దగ్గర బొలేరో వాహనం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు.
Samayam Telugu accident


అనంతపురం జిల్లాకు చెందిన ఐదుగురు సొంత పనిమీద బొలేరో వాహనంలో కర్ణాటకలోని పావగడకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. బెళుగుప్ప మండలం కాల్వపల్లి దగ్గర కారు బోల్తా పడింది. కారు అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ముగ్గురి మృతితో విషాద చాయలు అలముకున్నాయి.

ఇటు ముదిగుబ్బ మండలంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగుబ్బ బైపాస్ వద్ద టమోటాల లోడుతో వెళుతున్న బొలేరో వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై టమోటాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.