యాప్నగరం

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. తెలంగాణ వాసులుగా గుర్తింపు

కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు మృత్యువాతపడ్డారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 6 Dec 2019, 8:54 pm
దేవదేవుని దర్శనం చేసుకునేందుకు బయల్దేరిన ఓ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తిరుమల వేంకటేశునికి తమ చిన్నారి పుట్టువెంట్రుకలు సమర్పించి మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మరణించగా చిన్నారి గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. మృతులు తెలంగాణ వాసులుగా గుర్తించారు.
Samayam Telugu accident-pt


కడప జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్టడంతో ఒక మహిళ సహా ముగ్గురు మరణించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ పరిధిలోని కంకల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుటుంబం తమ చిన్నారి పుట్టువెంట్రుకలు సమర్పించి మొక్కు తీర్చుకునేందుకు కారులో తిరుమలకు బయల్దేరింది.

Also Read: అనంతపురంలో మరో దారుణం.. ఐరన్ బాక్స్‌తో భార్య ఒళ్లంతా కాల్చి..

రాఘవరాజపురం సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ బాలరాజు, ప్రశాంత్ సహా మరో మహిళ మృతి చెందింది. మహిళ వివారాలు తెలియాల్సి ఉంది. పుట్టువెంట్రుకలు తీయించేందుకు వెళ్తున్న చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ఈ రోజే ప్రారంభమైన టీడీపీ కొత్త కార్యాలయం.. కూల్చేయాల్సిందే అంటున్న వైసీపీ ఎమ్మెల్యే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.