యాప్నగరం

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లోనే ముగ్గురు..

అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన నిల్చున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Samayam Telugu 11 Nov 2019, 8:30 pm
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. పనికి వెళ్లి వస్తున్న కూలీల పైకి దూసుకెళ్లడంతో కురావడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. లారీ దూసుకొచ్చిన ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గుంటూరు - చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu accident


అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ఆ సమయంలో రోడ్డు పక్కన నిల్చుని ఉన్న కూలీలపైకి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

Also Read: విజయవాడలో దారుణం.. చిన్నారిని చంపేసి.. హంతకుడి హైడ్రామా!

చిలకలూరిపేట సమీపంలోని గణపవరం, తిమ్మాపురం గ్రామాల్లో జాతీయ రహదారి వెంబడి స్పిన్నింగ్ మిల్లులు, కాటన్ మిల్లులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులు కల్పతరువు స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే కూలీలుగా చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: యువతి ప్రాణం తీసిని సెల్ఫీ సరదా.. గుంటూరు జిల్లాలో విషాదం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.