యాప్నగరం

ఏపీలో ముగ్గురు ఐఏఎస్‌లకు కరోనా.. సీఎం జగన్ కార్యాలయంలో ఒకరికి..!

ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు కరోనా పాజిటివ్ అని తేలింది.

Samayam Telugu 27 Jun 2020, 7:19 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల్లో కరోనా వైరస్ (కోవిడ్ 19) కలకలం రేపుతోంది. ఏపీ సచివాలయంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా, ముగ్గురు ఐఏఎస్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో సచివాలయంలో ఇప్పటి వరకు 20కు పైగా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా సీనియర్ అధికారులకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది.
Samayam Telugu కరోనా వైరస్


ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కార్యాలయంలో పని చేసే ఐఏఎస్ అధికారికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఐఏఎస్ అధికారుల వ్యక్తిగత సిబ్బందిని కూడా ఇప్పటికే క్వారంటైన్‌కు వెళ్లిపోయారు.

కాగా, ఏపీలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు.. రోజురోజుకూ మరింత వేగంగా పెరుగుతున్నాయి. శనివారం బులిటెన్‌లో మొదటిసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 51 మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఐదుగురికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 796కు చేరాయి. ఒక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 12,285కు చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.