యాప్నగరం

అనంతపురం: ఆటోను ఢీకొట్టిన లారీ.. భార్యభర్తలు సహా ముగ్గురు మృతి

అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆటో రిక్షాను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

Samayam Telugu 12 Jul 2020, 9:34 am
Samayam Telugu అనంతపురంలో రోడ్డు ప్రమాదం
Anantapuram Road Accident
అనంతపురంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బత్తలపల్లి వద్ద ఆటోను మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదుచేసి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపినట్టు పోలీసులు తెలిపారు.

అతివేగంగా దూసుకొచ్చిన మినీలారీ.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టిందని, ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు అనంతపురం జిల్లా తాడిమర్రి మండల కేంద్రానికి చెందిన భార్య భర్తలు సూర్య, ఆదెమ్మగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే 108కు స్థానికులు ఫోన్ చేయగా.. గంట తర్వాత ఘటనాస్థలికి అంబులెన్స్ చేరుకోవడం గమనార్హం. దీంతో ప్రైవేట్ అంబులెన్స్‌కు ఫోన్ చేసిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తాడిమర్రి మండలం పిన్నదరి నుంచి ఆటోలో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరూ రోజూ బత్తలపల్లికి వచ్చి బొప్పాయి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.