యాప్నగరం

రైలు పట్టాలపై పని, విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు దుర్మరణం

విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో రైలు పట్టాలపై తొమ్మిది మంది కార్మికులు పని చేస్తుండగా హఠాత్తుగా కొండచరియలు విరిగి పడటంతో ముగ్గురు మృతి చెందారు.

Samayam Telugu 5 May 2020, 8:32 pm
విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలపై తొమ్మిది మంది కార్మికులు పని చేస్తుండగా హఠాత్తుగా కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో వారంతా తీవ్రంగా గాయాలపాలు కాగా, దగ్గరలో ఉ‍న్న ఎస్‌ కోట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ముగ్గురు మృతి చెందారు. మిగిలిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu విశాఖ ఏజెన్సీలో విరిగిపడ్డ కొండచరియలు


లాక్ డౌన్ వేళ ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని కేకే లైన్లో టైడా- చిముడు పల్లి రైలు మార్గంలో మంగళవారం పలువురు కార్మికులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సమయంలో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ సమయంలో అక్కడ తొమ్మిది మంది కార్మికులు పట్టాలపై పనిచేస్తున్నారు. వారిపై కొండచరియలు పడటంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు.

వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ముగ్గురు మరణించగా మిగిలిన వారికి ఎస్‌కోట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్మికుల మరణంతో విశాఖ ఏజెన్సీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.