యాప్నగరం

విశాఖలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు మృతి

ద్విచక్రవాహంపై వెళ్తున్నవారిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

Samayam Telugu 23 Dec 2019, 8:34 am
విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై వెళ్తున్నవారిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం శివరామపురం గ్రామానికి చెందిన ఉరిటి నాగేశ్వరరావు(33), నమ్మి సతీష్‌ (30), నమ్మి నాగ అప్పారావు (28)గా గుర్తించారు. ఈఘటనలో నమ్మి వేముళ్లు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ వెళ్తున్న వీరిని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలిలోనే తీవ్రగాయాలతో ముగ్గురు మృతిచెందారు.
Samayam Telugu road


ప్రమాదం గురించి పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. కశింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం గురించి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మృతుల కుటుంబాలు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.