యాప్నగరం

కృష్ణా జిల్లాలో నిమజ్జనం వేళ విషాదం.. నీటి మునిగిన ముగ్గురు యువకులు మృతి

అప్పటి వరకు ఆనందంగా గంతులు వేస్తూ వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ముగ్గురు యువకులు చెరువులో మునిగి విగతజీవులుగా మారిన విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Samayam Telugu 8 Sep 2019, 8:49 am
వినాయక నిమజ్జనం వేళ విషాదం నెలకుంది. విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు యువకులు నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఎ.కొండూరు తండాలో చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి స్థానిక చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనంలో పాల్గొన్న గోపాలరావు, భూక్యా నాయక్, చంటి ముగ్గురు నీటిలో మునిగి గల్లంతయ్యారు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ముగ్గురూ మృతిచెందారు. మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం మైలవరం ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా తమ కళ్లముందు కదలాడిన యువకులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Samayam Telugu ganesh


మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చెరువును లోతును అంచనా వేయడంలో విఫలం కావడం, ఈతరాకపోవడం వల్లే ఈ విషాదం అలముకుంది. నిమజ్జనం వేళ అప్రమత్తంగా ఉండాలని పోలీసు యంత్రాంగం హెచ్చరికలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. ఓ నిర్లక్ష్యం తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.

ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఓ యువకుడు గణేశ్ నిమజ్జనానికి వెళ్తూ ట్రాక్టక్ ఇంజన్‌ ముందు బాయ్‌నట్‌పై కూర్చొని ప్రదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అలాగే, వినాయక నిమజ్జనంలో ఆరుగురు వ్యక్తులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయని ఘటన గుజరాత్‌లో రెండు రోజుల కిందట చోటుచేసుకుంది. వినాయకుడిని నిమజ్జనం చేసి, స్నానం చేస్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు నదిలో మునిగిపోయారు. ఆరవిల్లి జిల్లా ఖదోల్‌ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నది లోతును గుర్తించడంలో విఫలమై నీటిలో మునిగిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.