యాప్నగరం

అమరావతి రైతులకు షాకిచ్చిన పోలీసులు

వెంకటపాలెంలో యూనియన్ బ్యాంక్ సమీపంలో ఇళ్లలో జై అమరావతి జిందాబాద్ అంటూ సుమారు 12 నుంచి 15మంది నినాదాలు చేయడం, లాక్‌డౌన్ సమయంలో బయట తిరగడం, కలవడం జరిగింది. క్షన్ 144, సీఆర్‌పీఎస్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున సెక్షన్ 188, 269, 270 ఐపీసీల ప్రకారం చట్టరీత్యా నేరం.

Samayam Telugu 13 Apr 2020, 9:27 am
అమరావతి రైతులకు పోలీసులు మరోసారి షాకిచ్చారు. లాక్‌డౌన్ అమలు చేస్తున్న వేళ రోడ్డుపై ఉద్యమం చేసిన రైతులకు నోటీసులు పంపించారు. వెంకటపాలెలంలో యూనియన్ బ్యాంక్ సమీపంలో ఇళ్లలో జై అమరావతి జిందాబాద్ అంటూ సుమారు 12 నుంచి 15మంది నినాదాలు చేయడం, లాక్‌డౌన్ సమయంలో బయట తిరగడం, కలవడం జరిగిందన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Samayam Telugu capital


పోలీసులు తమ నోటీసులో.. వెంకటపాలెంలో నివసిస్తూ ఏపీలో అమరావతి రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతో జై అమరావతి అంటూ ఉద్యమం చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌‌డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో 11-04-2020 రోజున వెంకటపాలెంలో యూనియన్ బ్యాంక్ సమీపంలో ఇళ్లలో జై అమరావతి జిందాబాద్ అంటూ సుమారు 12 నుంచి 15మంది నినాదాలు చేయడం, లాక్‌డౌన్ సమయంలో బయట తిరగడం, కలవడం జరిగింది అన్నారు.

అయితే సెక్షన్ 144, సీఆర్‌పీఎస్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున సెక్షన్ 188, 269, 270 ఐపీసీల ప్రకారం చట్టరీత్యా నేరం విషయమై 'మీపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో కారణాలు తెలియజేయవలసిందిగా నోటీసు ద్వారా మీకు తెలియజేయడమైనది' అన్నారు పోలీసులు. నోటీసులు అందుకున్న రైతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇవ్వాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.