యాప్నగరం

లాంచీ ప్రమాదం: 15మందికిపైగా ప్రాణాలు నిలబెట్టిన తూటిగుంట స్థానికులు

గోదావరిలో లాంచీ బోల్తా పడినట్లు గమనించి అప్రమత్తమైన తూటిగుంటవాసులు.. వెంటనే పడవల సాయంతో రంగంలోకి దిగారు. 15మందికిపైగా బాధితుల్ని రక్షించి.. ఒడ్డుకు చేర్చారు.

Samayam Telugu 15 Sep 2019, 11:44 pm
గోదావరిలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర లాంచీ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గల్లంతైనవారిలో 8మంది మృతదేహాలు రెస్క్యూ టీమ్‌లు వెలికి తీశారు. ఘటనలో 27మంది సురక్షితంగా బయటపడగా.. మరో 25మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతై గోదావరిలో కొట్టుకుపోతున్న పర్యాటకుల్ని సమీపంలోని తూటిగుంట గ్రామస్థులు రక్షించారు.
Samayam Telugu బోటు.


Don't Miss: 'మమ్మల్ని ముందే హెచ్చరించారు.. శవాసనమే కాపాడింది.. ఏం జరిగిందంటే'

ప్రమాదం జరిగిన తర్వాత పర్యాటకుల్లో కొందరు లైఫ్ జాకెట్లు ఉన్నవారు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారు. పరిస్థితిని గమనించిన కొందరు తూటిగుంట స్థానికులు వెంటనే రంగంలోకి దిగారు.. తమకు అందుబాటులో ఉన్న పడవల సాయంతో వారిని రక్షించారు. దాదాపు 15మందికిపైగా ప్రాణాలను నిలబెట్టారు. పడవల్లో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.. వారి ప్రాణాలను నిలబెట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లడానికి ఇబ్బందులు ఉండటంతో ఆ సాహసం చేయలేకపోయనట్లు చెబుతున్నారు.

Must Read: గోదావరి విషాదం: లాంచీ ప్రమాదానికి కారణాలు ఇవేనా!

తూటిగుంట స్థానికుల్ని అధికారులు అభినందించారు. ఒకవేళ వారు గల్లంతైనవారిని కాపాడకపోతే ప్రాణ నష్టం భారీగా ఉండేదంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై సమయ స్ఫూర్తితో ఇంతమంది ప్రాణాలను రక్షించగలిగారు. ప్రమాదం నుంచి బయటపడిన వారు తూటుగుంట స్థానికులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Read Also: ఆదివారం హడల్: బోటు ప్రమాదాలు ఎక్కువ ఆ రోజే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.