యాప్నగరం

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వెంకన్న దర్శనంపై టీటీడీ క్లారిటీ!

లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం.. ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ కొనసాగిస్తుండటంతో.. తాము కూడా దర్శనాలు వచ్చే నెల మూడు వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన టీడీడీ.

Samayam Telugu 14 Apr 2020, 3:50 pm
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెల మూడు వరకు భక్తులకు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 14 వరకు దర్శనాలు రద్దు చేశామని.. లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం.. ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ కొనసాగిస్తుండటంతో తాము కూడా దర్శనాలు వచ్చే నెల మూడు వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను టీటీడీ విడుదల చేసింది. మరోసారి దర్శనం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో భక్తులు నిరాశతో ఉన్నారు.
Samayam Telugu tirumala


భక్తుల్ని దర్శనానికి అనుమతించకపోయినా.. ఆగమ నియమాల ప్రకారం స్వామివారికి ప్రతి రోజూ నిర్వహించే అన్ని కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలియజేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల్ని అనుమతించడం లేదు. అలాగే కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. ఈ నెల 14 వరకు దర్శనం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మళ్లీ లాక్‌డౌన్ పొడిగించడంతో టీటీడీ కూడా దర్శనాలను మళ్లీ రద్దు చేసింది.

తిరుమలకు భక్తుల్ని అనుమతించకపోవడంతో ఏడుకొండలు వెల,వెలబోతున్నాయి. ఎప్పుడు భక్తులతో కళకళలాడే తిరుమల బోసిపోయింది. అలిపిరితో పాటూ మెట్ల మార్గం కూడా పూర్తిగా మూసివేశారు. స్వామివారికి కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు తిరుమలకు వెళ్లకపోవడంతో అడవి నుంచి జింకలు, చిరుతలు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. సోషల్ మీడియాలోనూ వీడియోలు వైరల్ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.