యాప్నగరం

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన ఆంక్షలు తొలగింపు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులపై విధించిన ఆంక్షలన్నీ తొలగిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Samayam Telugu 11 Dec 2020, 9:24 pm
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించే అంశంపై టీటీడీ పూర్తిగా నిబంధనలు తొలగించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటి వరకు పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులను టీటీడీ దర్శనానికి అనుమతించని విషయం తెలిసిందే. తాజాగా, అమల్లో ఉన్న నిబంధనలను తొలగించింది.
Samayam Telugu తిరుమల శ్రీవారి ఆలయం
tirumala temple


ఇకపై చిన్నారులు, వృద్ధుల నుంచి ప్రతి ఒక్కరూ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో భక్తులు దర్శనం చేసుకోవాలని సూచించింది.

అలాగే వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు కూడా లేవని.. ఎప్పటిలాగే దర్శనం చేసుకోవచ్చని టీటీడీ స్పష్టం చేసింది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో టీటీడీ పలు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని పూర్తిగా నిలిపివేసింది. అనంతరం పలు నిబంధనలు విధించి దర్శనాలకు అనుమతిచ్చింది. పిల్లలు, వృద్ధుల దర్శనంపై ఆంక్షలు విధించింది. ఈ తరుణంలో ఈ నిబంధనలను టీటీడీ తొలగించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.