యాప్నగరం

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరస్వామి భక్తులకు మరో శుభవార్త అందించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరను 50 శాతానికి తగ్గించింది. ఇకపై ఈ ధరలకే లడ్డూ విక్రయించనుంది.

Samayam Telugu 21 May 2020, 11:03 pm
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో శుభవార్త అందించింది. పెద్ద లడ్డూ ధర భారీగా తగ్గించింది. ఇప్పటివరకూ శ్రీవారి పెద్ద లడ్డూను రూ.200లకు విక్రయించారు. తాజాగా రూ.100 తగ్గించారు. ఇకపై ఈ లడ్డూను రూ.100కే విక్రయించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇప్పటికే చిన్న లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కి తగ్గించిన విషయం తెలిసిందే. వడ ధర మాత్రం యథాతథంగా ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.
Samayam Telugu తిరుపతి ఆలయం
Balaji Temple


లాక్‌డౌన్ కారణంగా తిరుమలలో రెండు నెలలుగా దర్శనాలు లేకపోయినా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం తగ్గలేదు. రెండు నెల్లలో రూ.1.98 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అధిక మొత్తం ఆన్‌లైన్ ద్వారానే వచ్చిందని చెప్పారు. ఇ-హుండీ ఆదాయం రూ.1.79 కోట్లు వచ్చిందని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు దర్శనం రద్దు చేసినా.. భక్తుల కోరిక మేరకు లడ్డూ ప్రసాదాల వితరణ మాత్రం కొనసాగుతోంది.

శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ 4.0లో పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం.. ఆలయాల్లో దర్శనాలను కూడా అనుమతిస్తారని భావించారు. ఈ క్రమంలో తిరుపతిలో భక్తుల దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిసింది. భౌతిక దూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే మే 31 వరకు అన్ని ఆలయాలను మూసివేయాలని కేంద్రం స్పష్టం చేయడంతో శ్రీవారి దర్శనానికి మరికొంత కాలం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tirupati Laddu Price


Also Read: రైల్వే కౌంటర్లలోనూ టికెట్ల విక్రయం.. కేంద్రం మరో శుభవార్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.