యాప్నగరం

తిరుపతిలో ఘోరం.. ఉద్యోగినితో బలవంతంగా మద్యం తాగించి..

మహిళపై కన్నేసిన సహోద్యోగులు ఎలాగైనా లొంగదీసుకునేందుకు యత్నించారు. బలవంతంగా మద్యం తాగించి పైశాచికత్వానికి పాల్పడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు నిద్రమాత్రలు మింగింది.

Samayam Telugu 6 Nov 2019, 6:47 pm
తిరుపతిలో ఘోరం జరిగింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగినితో సహోద్యోగులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి.. ఆపై అత్యాచారానికి యత్నించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు ఆత్మహత్యా యత్నం చేయడంతో విషయం సీరియస్ అయింది.
Samayam Telugu rape


తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిపై అత్యాచార యత్నం ఘటన కలకలం రేపుతోంది. వర్సిటీ ఐఎఫ్‌ఎల్‌సీ విభాగంలో పనిచేసే ముగ్గురు నాన్ టీచింగ్ రెగ్యులర్ ఉద్యోగులు అత్యాచార యత్నం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: మత విద్వేషాలకు చంద్రబాబు కుట్ర.. వైఎస్సార్సీపీ నేత సంచలన ఆరోపణలు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగినికి బలవంతంగా మద్యం తాగించి అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై ఎస్వీ వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేయడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచార యత్నం ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.