విధి ఆ యువకుడితో ఆడుకుంది.. దురదృష్టం వరుసగా అతడ్ని వెంటాడింది. తల్లికి అనారోగ్యం నుంచి కోలుకుంటున్నా సమయంలో తండ్రి మరణం కలిచి వేసింది. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఎలకపల్లె గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను వైద్యం కోసం పదిరోజుల క్రితం తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తండ్రిని కూడా వెంట తీసుకెళ్లాడు.
తిరుపతి ఆస్పత్రిలో తల్లికి ఆపరేషన్ చేయించారు.. తర్వాత తల్లి బాగోగులు చూసేందుకు తండ్రిని ఆస్పత్రిలోనే ఉంచాడు. తల్లి ఆరోగ్యం కుదుటుపడటంతో ఇటీవల డిశ్ఛార్జ్ చేశారు. ఆ యువకుడికి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అంతలోనే తండ్రిని కరోనా మహమ్మారి కాటేసింది.. వెంటనే అతడ్ని తిరుపతి స్విమ్స్ చేర్చగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. తల్లిని కాపాడుకునేందుకు తిరుపతికి వచ్చి తండ్రిని కోల్పోయానని బాధితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తల్లి అనారోగ్యం నుంచి కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది.
తిరుపతి ఆస్పత్రిలో తల్లికి ఆపరేషన్ చేయించారు.. తర్వాత తల్లి బాగోగులు చూసేందుకు తండ్రిని ఆస్పత్రిలోనే ఉంచాడు. తల్లి ఆరోగ్యం కుదుటుపడటంతో ఇటీవల డిశ్ఛార్జ్ చేశారు. ఆ యువకుడికి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అంతలోనే తండ్రిని కరోనా మహమ్మారి కాటేసింది.. వెంటనే అతడ్ని తిరుపతి స్విమ్స్ చేర్చగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. తల్లిని కాపాడుకునేందుకు తిరుపతికి వచ్చి తండ్రిని కోల్పోయానని బాధితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తల్లి అనారోగ్యం నుంచి కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది.