యాప్నగరం

వైసీపీ ఎంపీని అడ్డుకున్న టీడీపీ నేతలు.. చుట్టుముట్టి..

వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ వాహనాన్ని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. అమరావతి రైతులకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 2 Feb 2020, 4:36 pm
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేశ్‌ను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. తన సొంత పనిపై కృష్ణా జిల్లా నందిగామకు వచ్చిన ఎంపీ సురేశ్ వాహనాన్ని అడ్డుకున్నారు. రాజధాని అమరావతికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. గులాబీ పూలు ఇచ్చి తమ నిరసన తెలిపారు. వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అమరావతి రైతులకు మద్దతు తెలిపారని.. మిగతా ఎంపీలు కూడా స్పందించాలని కోరారు.
Samayam Telugu Suresh


ఎంపీ సురేశ్‌ను చట్టుముట్టిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అమరావతికి అనుకూలంగా నిలబడాలంటూ నినాదాలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి మొండిచేయి మిగిలిందని, అధికార పార్టీకి చెందిన ఎంపీల వల్ల ఏపీకి ఏమీ జరగడం లేదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు విమర్శించారు. అయితే అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని ఎంపీ సురేశ్‌ స్పష్టం చేశారు. కాగా, ఎంపీ సురేశ్ దుర్భాషలాడుతూ బెదిరించారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు ఆరోపించారు.

కాగా, రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ దాదాపు 45 రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రాజధాని రైతులకు మద్దతు ప్రకటించాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే మొగ్గు చూపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.