యాప్నగరం

ఇవాళ జగన్‌తో చిరంజీవి అండ్ టీమ్ భేటీ

ఇటీవల కేసీఆర్‌ను కలిసిన టాలీవుడ్ సెలబ్రిటీలు.. ఇవాళ జగన్‌తో భేటీ కానున్నారు. సినిమా షూటింగులకు అనుమతి, థియేటర్లలో సినిమా ప్రదర్శనలు వంటి సమస్యలపై చర్చించనున్నారు.

Samayam Telugu 9 Jun 2020, 7:34 am
లాక్ డౌన్‌తో దాదాపు అన్ని పరిశ్రమలు మూతపడిన విషయం తెలిసిందే. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు.. షూటింగులకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సినీ కార్మికుల సమస్యలు ప్రస్తావించారు. అయితే తాజాగా సోమవారం తెలంగాణలో సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చింది.దీంతో ఇప్పుడు సినీ బృందం ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు రెడీ అయ్యారు. ఇవాళ జగన్‌తో సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి బృందం భేటీ కానుంది.
Samayam Telugu సీఎం జగన్, చిరంజీవి


లాక్‌డౌన్‌ నిబంధనలకు భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సినిమా, టీవీ సీరియల్‌ షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి నేతృత్వంలో.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో సినీ బృందం భేటీ కానుంది. చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ, జీవిత, నిర్మాత సి.కళ్యాణ్‌ తదితరులు రానున్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్లలో ప్రదర్శనలు, మరికొన్ని సమస్యలపై వారు సీఎంతో చర్చించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.