యాప్నగరం

పోలవరంలో హీరోయిన్ అనుష్క: జనాల కళ్లుగప్పి.. స్వీటీ తెలివికి ఫిదా కావాల్సిందే!

Anushka in Polavaram: ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరానికి వచ్చారు.

Samayam Telugu 9 Dec 2020, 9:56 pm
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్‌ అనుష్క శెట్టి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. పోలవరంలోని మహా నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘బాహుబలి’ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన ప్రశాంతి త్రిపురనేని, మరో స్నేహితురాలితో కలిసి అనుష్క పోలవరంలో సందడి చేశారు.
Samayam Telugu గోదావరి నదిపై అనుష్క ప్రయాణం


అయితే ప్రజల కంట పడకుండా అనుష్క తెలివిగా వ్యవహరించారు. కరోనా మహమ్మారిని వల్ల ఏర్పడిన పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు. పూర్తిగా మాస్క్ ధరించి, జనాలకు ఎలాంటి అనుమానం రాకుండా చూసుకున్నారు. ఏకంగా స్నేహితులతో కలిసి అనుష్క గోదావరి నదిలో బోటులో షికారు చేశారు.
గోదావరిలో పడవ ప్రయాణం చేసే సమయంలో కూడా అనుష్క మాస్క్‌లు ధరించి ఉండటంతో స్థానికులు త్వరగా గుర్తుపట్టలేకపోయారు. దీంతో గోదావరి అందాలను అనుష్క తనివితీరా ఆస్వాదించారు. అదే మాస్క్ లేకపోతే అనుష్కను చూసేందుకు వచ్చే జనాల తాడికి ఊహించుకోవచ్చు. అయితే కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తన స్నేహితులతో కలిసి అభిమానుల కళ్లుగప్పి అనుష్క కోనసీమ అందాలు చూసి తెలివిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వీటీ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, అనుష్క లేటెస్ట్‌గా నటించిన నిశ్శబ్ధం సినిమా ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.