యాప్నగరం

జగన్‌ను కలిసిన టాలీవుడ్ బడా నిర్మాతలు

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన టాలీవుడ్ బడా నిర్మాతలు. విశాఖలో జరిగే కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలికిన ప్రొడ్యూసర్లు. ఇద్దరు సీఎంలు సినీ పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు నిర్మాతలు.

Samayam Telugu 26 Feb 2020, 9:17 pm
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు కలిశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో సీఎంతో సమావేశమయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్మాతల్ని దగ్గరుండి జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. జగన్‌ను కలిసిన వారిలో దగ్గుబాటి సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్‌లు ఉన్నారు.
Samayam Telugu jaaa.

2014లో హుదూద్‌ తుఫాన్ దెబ్బకు విశాఖలో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తుఫాన్ సమయంలో ఇళ్లు కోల్పోయిన నగరవాసులకు టాలీవుడ్ అండగా నిలిచింది.. సుమారు రూ.15 కోట్ల విరాళాల‌ను సేక‌రించి బాధితుల‌కు ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్ల‌ను ప్రారంభించడానికి రావాలని జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా సినీ పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు నిర్మాతలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.