యాప్నగరం

కర్నూలు: బిస్కెట్ తిన్న మరో బాలిక మృతి.. ముగ్గురు చిన్నారులు బలి

ముగ్గురు చిన్నారులు ఓ కిరాణా షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని తిన్నారు. ఆ బిస్కెట్లు తిన్న వెంటనే ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారులను ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 16 Sep 2020, 10:29 am
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ బిస్కెట్ తిన్న ఘటనలో మరో బాలిక కన్నుమూసింది. బిస్కెట్ తిని తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో ముగ్గురు చిన్నారులు ఓ కిరాణా షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని తిన్నారు. ఆ బిస్కెట్లు తిన్న వెంటనే ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారులను ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు మధ్యలోనే చనిపోగా.. మిగిలిన ఇద్దరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu కర్నూలు జిల్లాలో విషాదం


ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఒకరు చనిపోగా.. మరొకరి పరిస్థితి కూడా విషమంగా మారగా.. ఆ బాలిక కూడా చనిపోయింది. మృతులు హెస్సేన్ బాష, హుస్సేన్ బిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బిస్కెట్లు ఎక్కడ కొనుగోలు చేశారు.. ఆ షాపుకు ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో ఉన్నారు. ఒకే ఊరిలో ఇద్దరు చిన్నారులు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.