యాప్నగరం

విజయవాడవాసులకు అలర్ట్.. కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ఆంక్షలు

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు. వాహనాల యజమానులపై నిబంధనలు పాటించి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా ఉన్నాయి.

Samayam Telugu 30 Oct 2020, 9:56 am
విజయవాడవాసులకు అలర్ట్.. కనదుర్గ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ మళ్లించారు.. ఆంక్షలు విధించారు. సీపీ ఆదేశాలతో ప్లై ఓవర్ బ్రిడ్జ్‌పై భారీ వాహనాలు ,లారీలు, నిషేధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దారి మళ్లించారు. శుక్రవారం ఉదయం నుంచి భవానీపురం సెక్టార్ ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలు, టిప్పర్లు లారీలు కంటెయినర్లు, ఇతర వాహనాలు భవానీపురం స్వాతి సెంటర్ నుంచి గొల్లపూడి బైపాస్ రోడ్డు వైపు చర్చ్ సెంటర్ వైపుగా మళ్లించారు. ఇక నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దుర్గ బ్రిడ్జ్‌పై వాహనాలు నిషేధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Samayam Telugu కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్


చిన్నకార్లు, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సిలెండర్ల వాహనాలు, ఆటోలు,ద్విచక్ర వాహనాల రాకపోకలకు యధాతథంగా కొనసాగుతాయి. ప్రైవేటు బస్సులు స్వాతి సెంటర్ మీదుగా కొండ తిరిగి రావాల్సిందే.. రాత్రి వేళ 11 గంటల తర్వాత లారీలు, భారీ వాహనాలు అనుమతిస్తారు. వాహనాల యజమానులపై నిబంధనలు పాటించి సహకరించాలని భవానీపురం సెక్టార్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.