యాప్నగరం

విజయనగరం: రైలు ప్రమాదంలో తండ్రి మృతి.. తల్లికి కరోనా పాజిటివ్.. పాపం చిన్నారులు

భర్త పట్టాలపై శవమై కనిపించాడు.. భార్యకు కరోనా పాజిటివ్ తేలింది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. విజయనగరంలో జిల్లా పార్వతీపురంలో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Samayam Telugu 28 Jul 2020, 9:25 am
భార్యాభర్త, ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న జీవితం. ఇంతలోనే భర్త పట్టాలపై శవమై కనిపించాడు.. భార్యకు కరోనా పాజిటివ్ తేలింది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. విజయనగరంలో జిల్లా పార్వతీపురంలో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పట్టణంలో నివాసం ఉంటున్న కుటుంబంలో భార్యకు కరోనా పాజిటివ్ తేలింది.. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పిల్లలు ఇద్దరు తండ్రి దగ్గర ఉంటున్నారు.
Samayam Telugu విజయనగరం జిల్లాలో విషాదం


పార్వతీపురం పట్టణ రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాలపై తండ్రి అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత పిల్లలిద్దరూ ఇటు తండ్రి మృతదేహం వద్దకు వెళ్లలేక, అటు తల్లిని చూడలేని పరిస్థితి ఎదురైంది. ఇద్దరు పిల్లల్ని ఓదార్చి దగ్గరకు తీసేవారు లేకుండా పోయారు. ఇది చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడి భార్యకు చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడంతో తన భర్త, పిల్లలే జీవితంగా గడుపుతుంది. ఓవైపు భర్త చనిపోయాడు.. కరోనాతో మరోవైపు పిల్లలు దూరంగా ఉన్నారు.

ఆమె భర్తను చివరి చూపునకు నోచుకోలేకపోయింది. అంతేకాదు భార్యకు పాజిటివ్‌ ఉండటంతో పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని తీసేందుకు అందరూ వెనకడుగు వేశారు. పోస్టుమార్టం కోసం తరలించేందుకు గంటల సేపు వేచి చూడాల్సిన పరిస్థితి. చివరికి అతడి బావమరిది రిక్షాలో డెడ్‌బాడీని తరలించారు. అతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.