యాప్నగరం

ఏపీలో ఐసోలేషన్ వార్డులుగా ఏసీ బోగీలు.. రైల్వే అధికారుల వినూత్న ఆలోచన

Indian Railway: ఏపీలో రైల్వే ఏసీ బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 4 Apr 2020, 1:43 pm
రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో రైళ్లలోని ఏసీ బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేందుకు రైల్వే అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో మార్చి 23న రైళ్ల రాకపోకలను నిలుపుదల చేశారు. ఈ సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. జిల్లాలోని తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో షిర్డీ ఎక్స్‌ప్రెస్, హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేశారు.
Samayam Telugu railways


నిడదవోలు స్టేషన్‌లో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. ఇలా ఏలూరు, భీమవరం, నరసాపురం తదితర రైల్వే స్టేషన్లలో మొత్తం 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపి ఉంచారు. ఈ రైళ్లలో ఉన్న ఏసీ కోచ్‌లను ఐసొలేషన్‌ వార్డులుగా మార్చేందుకు గాను కాకినాడ తరలించేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.

షంటింగ్‌ విధానంలో జిల్లాలోని స్టేషన్‌లలో నిలుపుదల చేసిన ఈ 8 రైళ్లలోని ఏసీ బోగీలను ఒక్కటిగా లింక్‌ చేసి కాకినాడ తరలించనున్నట్లు ఓ రైల్వే అధికారి వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.