యాప్నగరం

కడప: కారును లాక్కెళ్లిన రైలు.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

ట్రాక్‌పై మధ్యలోకి వచ్చి కారు ఆగిపోయింది. అదే సమయంలో రెండు రైలింజన్లు వచ్చాయి. ఈ ప్రమాదంలో కారును రైలు కొంత దూరం లాక్కెళ్లింది. రైలు స్పీడు తక్కువగా ఉండటంతో కారు ట్రాక్ మీదే ఆగిపోయింది.

Samayam Telugu 27 Jun 2020, 12:54 pm
కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారును రైలు లాక్కెళ్లిన ఘటనలో ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రగుంట్ల మండలం వై కోడూరు దగ్గర రైల్వే ట్రాక్‌పై కారు రైల్వే లైనును దాటింది. ట్రాక్‌పై మధ్యలోకి వచ్చి కారు ఆగిపోయింది. అదే సమయంలో రెండు రైలింజన్లు వచ్చాయి. ఈ ప్రమాదంలో కారును రైలు కొంత దూరం లాక్కెళ్లింది. రైలు స్పీడు తక్కువగా ఉండటంతో కారు ట్రాక్ మీదే ఆగిపోయింది.
Samayam Telugu కడప రైలు ప్రమాదం


ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలుకాగా ఆస్పత్రికి తరలించారు. రైలు వేగం తక్కువగా ఉండటం.. కారు పట్టాలపై ఆగిపోయిందని.. లేదంటే ట్రాక్ దెబ్బతినేదని రైల్వే అధికారులు అంటున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. రైల్వే క్రాస్‌కు కాపలా లేకపోవడంతో.. రైళ్లు రావనుకుని ముందుకు వెళ్లారని అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.