మూడు వారాల్లో ఏడు కిలో మీటర్ల రోడ్డు
రోడ్డు విషయంలో అధికారుల తీరుతో విసుగు చెందిన తొమ్మిది గ్రామాల గిరిజనులు ఒక్కటయ్యారు. స్థానికంగా దొరికే మెటీరియల్తోనే మూడు వారాలు కష్టపడి ఏడు కిలోమీటర్లు పొడవున కొండను తవ్వి రోడ్డు వేశారు. 250 కుటుంబాలకు చెందిన 1500మంది ఈ పనిని పూర్తి చేశారు. అంతేకాదు స్థానికంగా ఇప్పటికీ వారికి విద్యుత్, వైద్య సేవలు లేవు.. ఇక గర్భిణీల పరిస్థితి వర్ణనాతీతం.
మెటల్ రోడ్డు వేస్తామంటున్న అధికారులు
మరోవైపు 2018-2019లో ఈ రోడ్డు నిర్మాణానికి NREGS గ్రాంట్ల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.40లక్షలు విడుదల చేసింది. ఈ రోడ్డు ప్రాజెక్ట్ను కూడా NREGS కిందకు తీసుకొని.. ఈ పనుల్లో భాగస్వామ్యం అయిన గిరిజనులకు డబ్బు చెల్లిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా స్థానికులు చాలా మంచి పని చేశారని.. ఇలాంటి మట్టి రోడ్డు సరిపోదని.. వర్షాకాలం వస్తే రోడ్డు మొత్తం కొట్టుకుపోతుందంటున్నారు. తాము మెటల్ రోడ్డు కోసం ప్లాన్ చేస్తున్నామన్నారు.