యాప్నగరం

కొత్త మంత్రుల్ని కలిసిన ఎమ్మెల్యే రాపాక.. పవన్‌, జనసేనపై ట్రోలింగ్స్

సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.. వైఎస్సార్‌సీపీ కేడర్.. జనసేన పార్టీని, అధినేత పవన్ కళ్యాణ్‌ను ట్రోల్స్ చేస్తున్నారు. అందరికంటే ముందు రాపాక వెళ్లి కొత్త మంత్రుల్ని కలిశారని ఎద్దేవా చేస్తున్నారు.

Samayam Telugu 23 Jul 2020, 8:39 am
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తీరు మరోసారి హాట్‌టాపిక్ అయ్యింది. జగన్ కేబినెట్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను ఎమ్మెల్యే రాపాక కలిశారు. కరోనా నిబంధనలతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన ఆయన.. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రత్యేకంగా అభినందించారు. పుష్పగుచ్ఛాలతో కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ పొందిన ధర్మాన కృష్ణదాస్‌ను అభినందించారు.
Samayam Telugu రాపాక వరప్రసాదరావు


Read Also: విశాఖ: సినిమాలో నటిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే.. అస్సలు గుర్తుపట్టలేరు

రాపాక వరప్రసాదరావు అధికార వైఎస్సార్‌సీపీ నేతల కంటే ముందుగానే కొత్త మంత్రులను కలిశారట. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.. వైఎస్సార్‌సీపీ కేడర్.. జనసేన పార్టీని, అధినేత పవన్ కళ్యాణ్‌ను ట్రోల్స్ చేస్తున్నారు. అందరికంటే ముందు రాపాక వెళ్లి కొత్త మంత్రుల్ని కలిశారని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు ఓవైపు ఆర్జీవీ సినిమా ట్రైలర్ దెబ్బకు జనసైనికులు, అభిమానులు బాధలో ఉన్నారని.. ఇప్పుడు ఎమ్మెల్యే దెబ్బకు డబుల్ షాక్ తగిలిందంటున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి రాపాక మరోసారి తన వ్యవహారశైలితో జనసేన సైనికుల్ని ఇరుకునపెట్టారు.

Also Read: గుంటూరు: టీవీ నటి, యాంకర్ రేఖ ఆత్మహత్య

రాపాక వరప్రసాదరావు చాలారోజులుగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. అధికారపార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా అధికారికంగా పాల్గొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.