తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్లపై అన్యమత ప్రచారం జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ టికెట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ టికెట్ల వ్యవహారంపై ఆరా తీస్తోంది.. అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టికెట్లు టీడీపీ హయాంలోనే ముద్రించినవని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అసలు వాస్తవం ఇది అంటూ ట్వీట్లు చేశారు. Read Also: 'జగన్.. మీ నాన్న ఇచ్చిన జీవో చూడు': స్వరూపానంద
‘తిరుమలలో అన్యమత ప్రచారం వెనుక వాస్తవం: ఈ మొత్తం ప్రక్రియకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఖరారైన టెండర్. చంద్రబాబు పేరుతో టిమ్ పేపర్లపై పథకాలను ప్రచారం చేసేందుకు 2018లోనే 60 వేల టిమ్ పేపర్లపై మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటనలు వేయాలని మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్కు కాంట్రాక్టు’అంటూ డాక్యుమెంట్లను ట్వీట్ చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కాంట్రాక్ట్ ఇదేనంటున్న వైవీ సుబ్బారెడ్డి. ‘ఆ టెండర్ కారణంగానే తిరుమల బస్ టిక్కెట్లపై ప్రకటనలు. బస్సు టిక్కెట్లపై ఈ ప్రకటనలను తొలగించే విధంగా చర్యలు చేపడతామని’మరో ట్వీట్ చేశారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా చర్యలు తీసుకుంటామని.. అలాగే తప్పుడు ప్రచారం చేసిన వారిపైనా చర్యలు తప్పవన్నారు
‘తిరుమలలో అన్యమత ప్రచారం వెనుక వాస్తవం: ఈ మొత్తం ప్రక్రియకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఖరారైన టెండర్. చంద్రబాబు పేరుతో టిమ్ పేపర్లపై పథకాలను ప్రచారం చేసేందుకు 2018లోనే 60 వేల టిమ్ పేపర్లపై మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటనలు వేయాలని మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్కు కాంట్రాక్టు’అంటూ డాక్యుమెంట్లను ట్వీట్ చేశారు.