యాప్నగరం

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా.. వాళ్లందరిలో టెన్షన్!

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 15 Oct 2020, 4:27 pm
ఏపీలో ప్రజా ప్రతినిధుల్ని కరోనా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు ఈ వైరస్ బారినపడ్డారు. ఒకరిద్దరికి రెండోసారి కరోనా తిరగబెట్టడంతో ఆస్పత్రిలో చేరారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 12న తన ఇంట్లో జరిగిన వేడుకలకు వెళ్లారు. వైవీ సుబ్బారెడ్డికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన్ను ఇటీవల కలిసిన వారిలో ఆందోళన మొదలైంది.
Samayam Telugu వైవీ సుబ్బారెడ్డి


ఇదిలా ఉంటే ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ని కూడా కరోనా వెంటాడుతోంది. గత నెలలో బ్రహ్మోత్సవాల కోసం తిరుమల వెళ్లి వచ్చిన తర్వాత గత నెల 28న ఆయనకు పాజిటివ్ తేలింది. అప్పటి నుంచి ఆయన చికిత్సపొందుతుండగా.. బుధవారం ఆయన ఆరోగ్యం కాస్త ఇబ్బంది మారింది. దీంతో హుటా హుటిన ఆయన్ను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను ప్రైవేట్ ఫ్లైట్‌లో హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. గతంలో మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దొరబాబును కూడా హెలికాప్టర్‌లో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.