యాప్నగరం

తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ నడక మార్గం మళ్లీ మూసివేత

తిరుమలపైనా భారీ వర్షాల ప్రభావం కనిపించింది. గురువారం ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇటు ఘాట్‌ రోడ్డులో కూడా చెట్లు, బండరాళ్లు విరిగిపడగా.. టీటీడీ సిబ్బంది తొలగించింది.

Samayam Telugu 27 Nov 2020, 6:39 am
నివర్ తుఫాన్ చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించింది. బుధ, గురువారం కురిసిన భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోయింది. వాగులు వంకలు పొంగి పొర్లగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇటు తిరుమలపైనా భారీ వర్షాల ప్రభావం కనిపించింది. గురువారం ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. మాఢ వీధులన్నీ జలమయం అయ్యాయి.. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇటు ఘాట్‌ రోడ్డులో కూడా చెట్లు, బండరాళ్లు విరిగిపడగా.. టీటీడీ సిబ్బంది తొలగించింది.
Samayam Telugu తిరుమల


ఈ భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేశారు. నివర్‌ తుపాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు విరిగిపడుతున్నాయి. దీంతో భక్తులకు ప్రమాదం పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా శ్రీవారి మెట్టు నడకదారిని టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తులను అనుమతించే విషయాన్ని తిరిగి తెలియజేస్తామని.. నడకదారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్‌ గేట్లు అధికారులు ఎత్తివేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.