టీటీడీపై తప్పుడు ప్రచారం, వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా టీటీడీ మాస పత్రిక సప్తగిరి వివాదంలోకి వెళ్లింది. గుంటూరుకు చెందిన ఒక పాఠకుడికి టీటీడీ మాస పత్రిక సప్తగిరితో పాటు అన్యమతానికి చెందిన మరో బుక్ రావడం హాట్టాపిక్ అయ్యింది. వెంటనే విషయం తెలుసుకున్న టీటీడీ.. ఇది దురుద్దేశపూర్వకంగా చేసిందని క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీనిపై విచారణ కూడా ప్రారంభమైంది. సప్తగిరి మాస పత్రిక ప్యాకింగ్, డెలివరీ భాధ్యత మొత్తం పోస్టల్ శాఖ చూస్తోంది. పోస్టల్ శాఖకు పోస్టేజి చార్జీలతో పాటు ఒక్కో మాసపత్రికకు అదనంగా రూ. 1.05 టీటీడీ అదనంగా చెల్లిస్తోంది. పోస్టేజీ సమయంలో ఎక్కడో తప్పు జరిగి ఉంటుందని టీటీడీ అనుమానిస్తోంది.
టీటీడీని తరచూ ఏదో ఒక వివాదం వెంటాడుతోంది. భూముల అమ్మకం, సప్తగిరి పత్రికలో కథపై వివాదం.. తర్వాతటీటీడీ ధర్మకర్తల మండలి సభ్యత్వానికి సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని ఫేస్బుక్లో అసత్య ప్రచారం జరిగింది. ఇలా ఏదో ఒక తప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంది. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు తిరుమలకు వెళ్లకూడదని తమిళ నటుడు శివకుమార్ ప్రచారం చేశారని తమిళ్మయ్యన్ అనే వ్యక్తి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీటీడీని తరచూ ఏదో ఒక వివాదం వెంటాడుతోంది. భూముల అమ్మకం, సప్తగిరి పత్రికలో కథపై వివాదం.. తర్వాతటీటీడీ ధర్మకర్తల మండలి సభ్యత్వానికి సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని ఫేస్బుక్లో అసత్య ప్రచారం జరిగింది. ఇలా ఏదో ఒక తప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంది. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు తిరుమలకు వెళ్లకూడదని తమిళ నటుడు శివకుమార్ ప్రచారం చేశారని తమిళ్మయ్యన్ అనే వ్యక్తి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.