యాప్నగరం

టీటీడీ ‘సప్తగిరి’ వ్యవహారంలో ట్విస్ట్.. కథ వెనుక కుట్ర కోణం, ఎడిటర్ సస్పెండ్

2016లో నిషేధించిన కథను పునీత్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి పేరుతో ప్రచురించారని విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. ఈ కథను ఉద్దేశపూర్వకంగా ప్రచురించి టీటీడీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే కారణంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 6 Jun 2020, 8:19 am
టీటీడీ సప్తగిరి మాసపత్రికలో లవకుశ కథ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సప్తగిరి చీఫ్ ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్గుణపై జేఈవో సస్పెన్షన్ వేటు వేశారు. 2016లో నిషేధించిన కథను పునీత్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి పేరుతో ప్రచురించారని విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. ఈ కథను ఉద్దేశపూర్వకంగా ప్రచురించి టీటీడీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే కారణంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. సప్తగిరి పత్రిక వివాదంపై విచారణ కొనసాగుతోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
Samayam Telugu సప్తగిరి మాసపత్రిక


టీటీడీ సప్తగిరి మాస పత్రికలో రామాయణంలోని లవకుశ కథ ప్రచురితమైంది. అందులో సీతకు లవుడు మాత్రమే కుమారుడని.. కుశుడు దర్బతో రాసిన బొమ్మ అంటూ కథలో రాశారు. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ పేరుతో ప్రచురితమైంది. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందన్నారు.

ఈ కథ వ్యవహారం వివాదంగా మారగా.. టీటీడీపై విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించారు.. కథ రాసినట్లు చెబుతున్న విద్యార్థితో పాటు తండ్రిని ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్, సబ్ ఎడిటర్‌పై వేటు పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.