యాప్నగరం

తిరుమల: ఎస్ఎంఎస్ పంపితే ఉచిత దర్శనం టికెట్.. ఎలా అంటే!

టీటీడీ ఎస్ఎంఎస్ ద్వారా కూడా దర్శనం టికెట్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. భక్తులు పంపించే ఎస్ఎస్‌లో ఆలయానికి సంబంధించిన కోడ్ తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడు దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు, భక్తుల సంఖ్యను కూడా పొందుపరచాల్సి ఉంటుంది.

Samayam Telugu 9 Jun 2020, 7:07 am
తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత వెంకన్న సన్నిధి సందడిగా కనిపిస్తోంది. ఇక ఈ నెల 11 నుంచి సాధారణ భక్తులు కూడా దర్శానానికి రానున్నారు. ఇక టీటీడీ కూడా తిరుపతిలోని దేవాలయాలను తెరిచింది. ఈ ఆలయాలను దర్శించాలనుకునే భక్తులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా టికెట్లు ఇస్తోంది. టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. భక్తులు http://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో.. ఆలయం దగ్గర ఉన్న మెషీన్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Samayam Telugu తిరుమల ఆలయాలు (File Photo)


టీటీడీ ఎస్ఎంఎస్ ద్వారా కూడా దర్శనం టికెట్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజస్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, కపిలేశ్వర స్వామి ఆలయాల్లో దర్శనాలకు టికెట్లు పొందొచ్చు. భక్తులు 9321033330 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ప్రతీ ఆలయానికి ఓ కోడ్ ఉంటుంది.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూర్- SVP
శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి- SVG
కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం- SVS
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలయగుంట- SVA
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, తిరుపతి- SVK

భక్తులు పంపించే ఎస్ఎస్‌లో ఆలయానికి సంబంధించిన కోడ్ తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడు దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు, భక్తుల సంఖ్యను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఆలయం పేరు స్పేస్ తేదీ స్పేస్ భక్తుల సంఖ్య టైప్ చేసి 9321033330 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ విధానం ద్వారా పైన తెలిపిన ఆలయాలకు మాత్రమే ఉచితంగా దర్శనం టికెట్లు ఇచ్చే విధానం ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.