యాప్నగరం

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. 226 రోజుల తర్వాత

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను ప్రారంభించారు. సహస్రదీపాలంకరణ సేవ మండపానికి తీసుకొచ్చి.. మాడ వీధుల్లో ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు.

Samayam Telugu 2 Nov 2020, 8:02 am
తిరుమల శ్రీవారు 226 రోజుల తర్వాత గడప దాటారు. కరోనా వ్యాప్తి తర్వాత 226 రోజులుగా ఆలయంలోనే ఏకాంతంగా సేవలు అందుకుంటున్న స్వామి.. ఆదివారం మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను ప్రారంభించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చి ఆర్జిత బ్రహ్మోత్సవం నిర్వహించారు. అనంతరం సహస్రదీపాలంకరణ సేవ మండపానికి తీసుకొచ్చి.. మాడ వీధుల్లో ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు.
Samayam Telugu తిరుమల


ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ ఆన్‌లైన్‌ వర్చువల్‌ సేవకు టికెట్లను నవంబరు రెండో వారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ సేవలు పొందిన భక్తులకు ఆ టికెట్టుపై శ్రీవారి దర్శనం ఉండదు. మరోవైపు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 16వేల టికెట్లను ఇచ్చారు. శ్రీవాణి ట్రస్టు, బ్రేక్‌ దర్శనాల ద్వారా భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం సర్వదర్శన టోకెన్ల జారీ అంశంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.. ఆ తర్వాతే ఎంతమంది భక్తులను దర్శనానికి అనుమతిస్తారన్నది క్లారిటీ రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.