యాప్నగరం

బీజేపీ ఎంపీకి తిరుపతిలో చేదు అనుభవం!

ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమె.. అలిపిరి టోల్‌గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.

Samayam Telugu 1 Mar 2020, 1:36 pm
బీజేపీ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు తిరుపతి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఉదయం తన భర్తతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమెను అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె వాహనంపై ఉన్న బీజేపీ సింబల్‌ను తొలగించాలని సూచించారు. దీనిపై అధికారులకు పిర్యాదు చేస్తానని ఎంపీ చెప్పగా.. సిబ్బంది ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా విజిలెన్స్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఎంపీ ఆరోపించారు.
Samayam Telugu sasikala pushpa


సిబ్బంది తీరును తను సెల్ ఫోన్‌లో చిత్రీకరించగా.. అడ్డుకున్న సిబ్బంది తన ఫోన్‌ను లాక్కున్నారని ఎంపీ శశికళ పుష్ప తెలిపారు. ఎంపీ శశికళ పుష్ప ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తనకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

తమిళనాడుకు చెందిన శశికళ పుష్పను 2016లో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. దీంతో ఆమె ఇటీవలే బీజేపీలో చేరారు. మరి కొద్ది నెలల్లో ఆమె రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోనుంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె తూత్తుకుడి మేయర్‌గానూ పని చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.