ఏపీ అసెంబ్లీ సమావేశాల హీట్ సోషల్ మీడియాకు చేరింది. సభలో చంద్రబాబు, లోకేష్లపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడితే.. తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇస్తున్నారు. కరోనాపై చర్చ సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి లోకేష్, చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో చంద్రబాబు రాష్ట్రంలో లేకుండాపోయారని.. ఆయన ఎన్ఆర్ఐ అంటూ సెటైర్లు పేల్చారు.
75ఏళ్ల వయస్సులో చంద్రబాబు కరోనా వస్తుందన్న భయంతో ప్రజల కోసం బయటకు రాలేదని.. ఆయన కొడుకు గున్న ఏనుగులా ఉన్నాడు.. ప్రజాసేవకు బయటకు రావొచ్చు కదా అంటూ విరుచుకుపడ్డారు. లాక్డౌన్తో కష్టాల్లో ఉంటే ప్రజలకు చంద్రబాబు కనీసం కేజీ కందిపప్పు, నాలుగు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదన్నారు. ఈ వీడియోను వైఎస్సార్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇటు బియ్యపు మధుసూధన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఆయన గతంలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను ట్రోల్ చేస్తున్నారు. అమెరికాను కనిపెట్టి వాస్కోడిగామా అనబోయి ఆయన నోరు జారారు.. వాసిగొడం అన్నారు. ఈ వీడియోను ట్వీట్ చేసి.. ఈయన ఎమ్మెల్యే ఎలా అయ్యారో అంటూ మండిపడుతున్నారు. తమ పార్టీ నేతను ఏదైనా అంటే ఊరుకునేది లేదంటున్నారు. దీంతో వైఎస్సార్సీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.
75ఏళ్ల వయస్సులో చంద్రబాబు కరోనా వస్తుందన్న భయంతో ప్రజల కోసం బయటకు రాలేదని.. ఆయన కొడుకు గున్న ఏనుగులా ఉన్నాడు.. ప్రజాసేవకు బయటకు రావొచ్చు కదా అంటూ విరుచుకుపడ్డారు. లాక్డౌన్తో కష్టాల్లో ఉంటే ప్రజలకు చంద్రబాబు కనీసం కేజీ కందిపప్పు, నాలుగు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదన్నారు. ఈ వీడియోను వైఎస్సార్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.