అంబటి, రామ్మోహన్ మధ్య వార్
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ, వైసీపీ నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలతో ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఆదివారం శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. తొలుత ఎంపీ శ్రీకాళం మాండలికంలో జగన్పై విమర్శలు చేయగా.. ఎమ్మెల్యే రాంబాబు కూడా అదే సిక్కోలు యాసలో కౌంటర్ ఇచ్చారు.
ఎంపీ రామ్మోహన్నాయుడు సెటైర్లు
‘‘జగనోరి ‘సాక్షి’ అబద్ధాలు అచ్చోసి కుమ్మబోతే, ఒడుపుగా ఒడిసిపట్టి దాని కొమ్ములిరిసి, దమ్ముంటే రమ్మనంటూ రొమ్ము విరిచి పిలిచినోడు.. మా చంద్రబాబు. అక్రమాల వారసుడు జగన్మోహనుడు తెలుగుదేశం ఎంట పడితే గుద్ది గుండ సేసినాడు మా చంద్రబాబు.’’ అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. వైసీపీవి తప్పుడు వార్తలని తేలిపోయాయంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.
Twitter-Ram Mohan Naidu K
ఎమ్మెల్యే అంబటి కౌంటర్
‘‘బాబొరి కథలు అన్ని అల్లి చెపుతాడు .. రొమ్ము విరిచి చంద్రబాబు సంచులెన్నో మోసాడు కెమెరాలకి సిక్కి.. బిక్కిబిక్కి పరిగెత్తి ఆంధ్రకు వచ్చినాడు.. భ్రమారావతి చెప్పి బినామీ బాగుల్ని నింపినాడు.. ఎన్నికల్లో ప్రజలు ఎత్తి 23 ఇచ్చినారు, కోడుకేమో ఒడి పాయే.. పచ్చ మీడియాకి పిచ్చెక్కే’’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీడీపీ తప్పుడు వార్తల ప్రచారం అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.