యాప్నగరం

ఏపీ: మరో ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య. ఇసుక దొరక్క, పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు తీసుకున్నారని చెబుతున్న కుటుంబ సభ్యులు.

Samayam Telugu 2 Nov 2019, 12:15 pm
ఏపీలో మరోసారి భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు కలకలంరేపాయి. గుంటూరు జిల్లాలో శనివారం ఇద్దరు కార్మికులు ప్రాణాలు తీసుకున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో గుర్రం నాగరాజు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. నాగరాజు తాపీ మేస్త్రి కాగా.. భార్య ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌ఉమెన్‌గా ఉంది. కొద్దిరోజులుగా పనుల్లేక.. కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయని భార్య చెబుతోంది.
Samayam Telugu gnt.


ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో నాగరాజు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు భార్య వాణి చెబుతోంది. నాగరాజు మరణంతో భార్య, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే. పొన్నూరులో కూడా మరో భవన నిర్మాణ కార్మికుడు ప్రాణాలు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అడపా రవి అనే వ్యక్తి రోజువారీ కూలి పనులకు వెళుతున్నాడు. కొద్ది రోజులుగా పనులు లేకపోవడంతో.. పురుగు మందు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గత వారమే గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు కార్మికులు కూడా ఇలాగే ఆత్మహత్యలు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.