యాప్నగరం

గుంటూరులో విషాదం.. కాలిబూడిదైన ఇద్దరు వ్యక్తులు

మెడికల్ షాపులో పేలుళ్లు జరగడం గుంటూరులో కలకలం రేపింది. యజమాని సహా మరో వ్యక్తి ఈ ప్రమాదంలో చనిపోయారు. అసలు మందుల షాపులో పేలుడు జరగడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Samayam Telugu 31 Oct 2019, 4:04 pm
గుంటూరులో విషాదం చోటు చేసుకుంది. మెడికల్ షాపులో పేలుళ్లతో ఇద్దరు దుర్మరణం చెందారు. అర్ధరాత్రి వేళ పెద్దశబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కలకలం రేగింది. కొత్తపేట శీలంవారి వీధిలో ఉన్న మెడికల్ డిస్ట్రిబ్యూటర్ షాపులో పేలుళ్లు జరిగాయి. పేలుడు ధాటికి పక్క షాపులు సైతం ధ్వంసమయ్యాయి. భారీ పేలుడు జరగడంతో ఇనుప షట్టర్లు సైతం దెబ్బతిన్నాయి.
Samayam Telugu guntur


ఈ ప్రమాదంలో షాపు యజమాని రామారావుతో పాటు మరొకరు మరణించారు. పేలుడుకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏసీ గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తూ పేలుళ్లు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏసీ గ్యాస్‌తో భారీ పేలుడు సంభవించే అవకాశాలపైనా ఆరా తీస్తున్నారు. గ్యాస్ వల్ల పేలుడు జరిగినట్లుగా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: విశాఖలో దారుణం.. యువతిపై గ్యాంగ్‌రేప్

ఓ మెడికల్ షాపులో పేలుళ్లు చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మందుల దుకాణంలో పేలుడుకు సంబంధించిన వస్తువులు ఏం ఉంటాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీ గ్యాస్‌తో అంత పెద్ద పేలుడు జరిగే అవకాశాలు లేవని, మరేదైనా కారణమై ఉండొచ్చని టెక్నీషియన్లు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.