యాప్నగరం

ప్రకాశం: పెళ్లిలో కొట్లాట.. వధువు మేనమామ మృతి, కారణం తెలిసి అంతా షాక్

వరుడు, వధువు కుటుంబాలు.. బంధువుల మధ్య వివాహ వేడుక ఘనంగా జరిగింది. తర్వాత అందరూ కలిసి విందు భోజనానికి వెళ్లారు. ఇదే సమయంలో విందులో చిన్న అలజడి రేగింది.

Samayam Telugu 22 Aug 2020, 6:40 am
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి విందులో మాంసం సరిగ్గా వడ్డించలేదన్న కారణంతో జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. వధువు మేనమామ చనిపోవడం కలకలంరేపింది. వెలిగండ్ల మండలం గుమ్మలకర్రకు చెందిన మన్నేపల్లి సురేష్‌‌కు తన మేనకోడలు కవిత వివాహానికి నర్సమాంబాపురం వచ్చాడు. వరుడు, వధువు కుటుంబాలు.. బంధువుల మధ్య వివాహ వేడుక ఘనంగా జరిగింది. తర్వాత అందరూ కలిసి విందు భోజనానికి వెళ్లారు. ఇదే సమయంలో విందులో చిన్న అలజడి రేగింది.
Samayam Telugu two groups fight for meat in a marriage one died at prakasam district
ప్రకాశం: పెళ్లిలో కొట్లాట.. వధువు మేనమామ మృతి, కారణం తెలిసి అంతా షాక్


భోజనాల వడ్డించే సమయంలో మాంసం సరిగ్గా పెట్టలేదని పెళ్లికుమారుడి బంధువులకు, పెళ్లికుమార్తె బంధువులకు మధ్య గొడవ మొదలై అది ఘర్షణకు దారి తీసింది. ఆ వివాదం పెద్దల జోక్యంతో సద్దుమణిగింది.. వధువు మేనమామ సురేష్‌ తమను అవమానించాడంటూ పెళ్లి కుమారుడి బంధువులు కక్ష పెంచుకున్నారు. సాయంత్రం బడ్డీకొట్టు దగ్గరకు వెళ్లిన సురేష్‌‌పై గొడ్డలితో దాడి చేశారు. అతడిని వెంటనే కనిగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా సురేష్‌ మార్గ మధ్యలో చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు కారణం తెలిసి షాక్ తిన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.